
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయ్యింది. పీర్జాదిగూడకు చెందిన రాధిక ఫిర్యాదు మేరకు తప్పుడు పత్రాలతో భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీసులు. పల్లాపై ఐపీసీ సెక్షన్ 447, 427, 506 కింద కేసు నమోదు చేశారు.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని కొర్రెముల్ల సర్వే నంబర్ 796లో తమ ప్లాట్స్ కబ్జా చేశారని పోచారం ఐటీ కారిడార్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఏ1 గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2గా ఆయన భార్య నీలిమా చౌదరి, ఏ3గా మధుకర్ రెడ్డిని చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. 38ఈ హోల్డర్స్ రిజిస్ట్రేషన్స్ చేసి కబ్జాకు యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పల్లా ఫ్యామిలీ 200మందిని ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు. రోడ్లు ,పార్క్ ప్లేసు ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. అనురాగ్ ఆస్పత్రి నిర్మాణం పేరుతో పల్లా ఫ్యామిలీ భూమిని కబ్జా చేశారంటూ ఆరోపణలున్నాయి. హెచ్ఎండీఏ, రెవెన్యూ, కోర్టులను తప్పుదారి పట్టించినట్లు పల్లాపై ఆరోపణలున్నాయి.