సుజిత్ డైరెక్షన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా సాహో. ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ రిలీజ్ డేట్ మారింది. ఫస్ట్ సాహోను ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు15న రిలీజ్ చేయనున్నట్లు తెలిపిన సినిమా యూనిట్..ఇప్పడు మరో డేట్ ఫిక్స్ చేసింది. కొన్ని కారణాల వల్ల ఆగస్టు -30కి వాయిదా వేసినట్లు మంగళవారం అనౌన్స్ చేస్తూ ఈ మూవీలోని ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆగస్ట్ 30న రిలీజ్ అని ఉన్న సాహో పోస్టర్ లో ప్రభాస్, శ్రద్ధ అందంగా ఉన్నారు. పోస్టర్ లో శ్రద్ధ.. ప్రభాస్ ను ప్రేమగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి ఉన్న పోస్టర్ ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఫస్ట్ నుంచి ఈ మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉండగా..టీజర్, లేటెస్ట్ గా వస్తున్న పోస్టర్స్ తో మరిన్ని అంచనాలను పెంచుకుంటున్నారు ఫ్యాన్స్.
భారతీయ ఫస్ట్ భారీ యాక్షన్ సినిమాగా సాహోను తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ రూ.150 కోట్లతో సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపింది సినిమా యూనిట్.
Buckle up! We're coming to you on 30th Aug. #Saaho releasing worldwide on 30.08.2019!#Prabhas @ShraddhaKapoor @NeilNMukesh @arunvijayno1 @sujeethsign @UV_Creations @itsBhushanKumar @TSeries #SaahoOnAugust30 pic.twitter.com/Rc3qJWudVO
— UV Creations (@UV_Creations) July 23, 2019