
- మాదాపూర్ పీఎస్లో న్యూసెన్స్ కేసు
మాదాపూర్, వెలుగు : సినీ హీరో రాజ్తరుణ్, లావణ్య గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం రాత్రి లావణ్య మాదాపూర్ కాకతీయ హిల్స్ రోడ్డు నెం.7లోని రాజ్తరుణ్ ఇంటికి వెళ్లింది. ఓ వైపు కాలింగ్బెల్ కొడుతూనే.. మెయిన్ డోరును బలంతా తంతూ గొడవ చేసింది.
రాజ్తరుణ్ తల్లిదండ్రులు బస్వరాజు, రాజ్యలక్ష్మి గురువారం సాయంత్రం మాదాపూర్పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, లావణ్య తమపై దాడికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. న్యూసెన్స్కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ఇన్ స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపారు.