రాజ్​తరుణ్ ​ఇంటి వద్ద లావణ్య లొల్లి

రాజ్​తరుణ్ ​ఇంటి వద్ద లావణ్య లొల్లి
  •     మాదాపూర్​ పీఎస్​లో న్యూసెన్స్​ కేసు

మాదాపూర్, వెలుగు : సినీ హీరో రాజ్​తరుణ్, లావణ్య గొడవ రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం రాత్రి లావణ్య మాదాపూర్ కాకతీయ హిల్స్ రోడ్డు నెం.7లోని రాజ్​తరుణ్​ ఇంటికి వెళ్లింది. ఓ వైపు కాలింగ్​బెల్​ కొడుతూనే.. మెయిన్ డోరును బలంతా తంతూ గొడవ చేసింది.

రాజ్​తరుణ్​ తల్లిదండ్రులు బస్వరాజు, రాజ్యలక్ష్మి గురువారం సాయంత్రం మాదాపూర్​పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, లావణ్య తమపై దాడికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. న్యూసెన్స్​కేసు నమోదు చేసినట్లు మాదాపూర్​ఇన్ స్పెక్టర్ కృష్ణమోహన్​ తెలిపారు.