మహిళలు రాణిస్తేనే దేశం అభివృద్ధి : లక్ష్మణ్ 

మహిళలు రాణిస్తేనే దేశం అభివృద్ధి : లక్ష్మణ్ 

ముషీరాబాద్/ఘట్ కేసర్ వెలుగు: మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం ప్రధాని మోదీ పని చేస్తున్నారని తెలిపారు. ముషీరాబాద్ లోని కసిష్ ఫంక్షన్ హాల్ లో బుధవారం హెల్త్ బేబీ కిట్స్ ను లక్ష్మణ్ పంపిణీ చేసి మాట్లాడారు. పోషకార లోపంతో ఎవరు కూడా ఇబ్బంది పడద్దని ప్రధాని మోదీ సూచన మేరకు చిన్న పిల్లలకు పోషకాలు అందేలా కిట్స్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కార్పొరేటర్ పావని  పాల్గొన్నారు.

పుట్టిన గడ్డను ఆదర్శంగా చేస్తా..

 ఘట్ కేసర్ టౌన్ లోని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు గేల్ సంస్థ సీఎస్ఆర్ నిధులు కింద రూ.75 లక్షలతో అందజేసిన వైద్య పరికరాలను ఎంపీ లక్ష్మణ్ ప్రారంభించి మాట్లాడారు. ఘట్ కేసర్ లో పుట్టి పెరిగిన నాకు ఈ ప్రాంతం అత్యున్నతమైన అవకాశాలను అందించినందున అన్నిరంగాల్లో అభివృద్ధి పరచి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పావని జంగయ్య యాదవ్, సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి రాంరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.