వికారాబాద్ జిల్లా: తాండూర్ లో జరిగిన ఫాగింగ్ మిషన్ పంపిణీ కార్యక్రమంలో.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి లొల్లి పెట్టుకున్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్దం నడించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు కూడా వాగ్వాదానికి దిగారు. ప్రోటోకాల్ విషయంపై సమావేశంలో బైఠాయించి నిరసన తెలిపారు ఎమ్మెల్సీ వర్గీయులు. స్టేజ్ మీద లీడర్లు, స్టేజ్ కింద లీడర్ల అనుచరులు గొడవకు దిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సర్ధిచెప్పినా నేతలు వెనక్కి తగ్గలేదు.