గోదావరిఖనిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినోత్సవం

గోదావరిఖనిలో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినోత్సవం

గోదావరిఖని :  తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం గోదావరిఖనిలోని 40 డివిజన్ లో బీజెేపిీ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ ఆధ్వర్యంలో జాతీయ పతాకాన్ని ఎగరేశారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా దుబాసి లలిత మల్లేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాకముందు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని నమ్మబలికి.. సిఎం అయ్యాక రాచరిక పాలన కొనసాగిస్తున్నారన్నారు. మరో నిజాంలా వ్యవహారిస్తూ కోంతమంది మెప్పు కోసం విమోచన దినాన్ని జరపడం లేదన్నారు. తెలంగాణ ప్రజలు మరోక పోరాటం చెసే పరిస్థితి తెచ్చాడని.. ప్రజలు కేసీఆర్ మాయ మాటలను నమ్మవద్దని కోరారు దుబాసి లలిత మల్లేష్.