లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులతో యువకుడు సూసైడ్

లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులతో యువకుడు సూసైడ్

మెహిదీపట్నం, వెలుగు: లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలైన ఘటన గుడిమల్కాపూర్ పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ప్రాంతానికి చెందిన శీలం బాలకృష్ణ కార్పెంటర్. కొన్నేండ్ల కిందట సిటీకి వచ్చి గుడిమల్కాపూర్ హీరానగర్ లో కుటుంబంతో నివసిస్తున్నాడు. అతని పెద్ద కొడుకు శీలం మనోజ్ (20) దుండిగల్ లోని ఓ కాలేజీలో బీటెక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. 

రెండు నెలల కిందట అతడు లోన్ యాప్ లో అప్పు తీసుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో  రెండు నెలల కింద వారు సుమారు రూ. 3 లక్షలు చెల్లించారు.  మరికొన్ని  లోన్ యాప్స్​ ఏజెంట్లు డబ్బు కట్టాలని  వేధింపులకు గురి చేయడంతో  తట్టుకోలేక  సోమవారం ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. ఈ మేరకు బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్ స్పెక్టర్ తెలిపారు.