
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని నియంత్రించే ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025’ బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు, ప్రతిపక్షాల నిరసనల మధ్య పాస్ అయింది. రియల్ మనీ గేమింగ్ (పోకర్, ఫాంటసీ స్పోర్ట్స్) నిషేధించడం, ఈస్పోర్ట్స్, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్ను ప్రోత్సహించడం దీని లక్ష్యం. అలాగే భారత్ను గ్లోబల్ గేమింగ్ హబ్గా మార్చాలని కూడా టార్గెట్ పెట్టుకున్నారు. ఈ బిల్లు ప్రకారం సెంట్రల్ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఏర్పాటు చేస్తారు.
ఇది గేమ్స్ను ఈస్పోర్ట్స్, ఎడ్యుకేషనల్, సోషల్, రియల్ మనీ గేమ్స్ అని నాలుగు రగాలు వర్గీకరిస్తుంది. రియల్ మనీ గేమ్స్ ను ఆఫర్ చేయోద్దు, వాటికి సహకారం అందివొద్దు.. అడ్వర్టైజ్మెంట్నూ నిషేధించారు. బ్యాంకులు కూడా వీటి లావాదేవీలు చేయకూడదు. రియల్ మనీ గేమ్స్ నిర్వహిస్తే మూడేండ్ల జైలు లేదా రూ.1 కోటి జరిమానా విధిస్తారు. రెండూ కూడా విధించవచ్చు. వీటిని అడ్వర్టైజ్ చేస్తే రెండేండ్ల జైలు, రూ.50 లక్షల ఫైన్. మళ్లీమళ్లీ చేస్తే ఐదేండ్ల జైలు, రూ.2 కోట్ల ఫైన్ విధిస్తారు. ఇవి కాగ్నిజబుల్, నాన్-బెయిలబుల్ నేరాలు. వీటిని ఆడేవారిని బాధితులుగా పరిగణిస్తారు.