వరద నీటిలో కొట్టుకుపోయిన లారీ

వరద నీటిలో కొట్టుకుపోయిన లారీ

ఛత్తీస్ఘడ్ బీజాపూర్ జిల్లాలో రేషన్ బియ్యం లోడ్తో వెళ్తున్న లారీ వరద నీటిలో కొట్టుకుపోయింది. భూపాలపట్నం మెట్టుపల్లి వద్ద బడా నాలాపై  నుంచి వెళ్తుండగా ఇంజన్లో సమస్య తలెత్తడంతో లారీ ఆగిపోయింది. వరద నీరు అంతకంతకూ పెరుగుతుండటంతో డ్రైవర్ ట్రక్కును వరద నీటిలోనే వదలి సురక్షిత ప్రాంతానికి వెళ్లాడు. డ్రైవర్ వెళ్లిన కాసేపటికే వరద ప్రవాహం మరింత పెరగడంతో బియ్యం బస్తాలతో నిండిన లారీ కొట్టుకుపోయింది.