లూనార్​ పోలార్​ ఎక్స్​ ప్లొరేషన్​ మిషన్​

లూనార్​ పోలార్​ ఎక్స్​ ప్లొరేషన్​ మిషన్​

చంద్రుడి దక్షిణ ప్రాంత అన్వేషణ, ఉపరితలంపై నీటిజాడ, ఇతర మూలకాల ఉనికిని అన్వేషించడానికి లూనార్​ పోలార్​ ఎక్స్​ ప్లొరేషన్​ మిషన్​(ఎల్​యూపీఈఎక్స్​ను భారత అంతరిక్ష సంస్థ, జపాన్​ ఏరోస్పేస్​ ఎక్లోస్పెరేషన్​ ఏజెన్సీ(జేఈఎక్స్​ఏ) సంయుక్తంగా ప్రయోగించనున్నాయి. ఈ మిషన్​ను జపాన్​ హెచ్​3 రాకెట్​ ద్వారా ప్రయోగించనున్నారు. ఇందులో ల్యాండర్​, రోవర్​ ఉంటాయి. రోవర్​ అభివృద్ధి నిర్వహణ బాధ్యత జాక్సా చేపట్టనుండగా, రోవర్​ను మోసుకెళ్లే ల్యాండర్ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతను ఇస్రో తీసుకుంది. 

  • రోవర్ తనంతట తానుగా ప్రయాణిస్తూ చంద్రుడి ఉపరితలంపై నీటి జాడలను అన్వేషించనుంది. అలాగే, డ్రిల్లింగ్​ మిషన్​తో చంద్రుడి ఉపరితలాన్ని తవ్వి మట్టి శాంపిల్స్​ను సేకరిస్తుంది.
  • రోవర్​పై అమర్చిన పరిశీలన పరికరాలతో రెగోలిత్​(చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టి) నుంచి సేకరించిన శాంపుల్స్​ను విశ్లేషించి భూమికి సమాచారాన్ని పంపుతుంది. ఈ రోవర్​ ఇస్రో, జేఏఎక్స్​ఏ పరికరాలను మాత్రమే కాకుండా యూఎస్​ అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ(ఈఎస్​ఏ) పరికరాలను కూడా తీసుకెళ్లనుంది. ​