- ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా
హైదరాబాద్, వెలుగు : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారితో మండలిలో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్ హాజరయ్యారు. కాగా, ప్రమాణ స్వీకారానికి బల్మూరి వెంకట్ బుల్లెట్పై మండలికి వచ్చారు. పెద్ద సంఖ్యలో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ఆయనతో పాటు వచ్చారు.
దీంతో మండలి చైర్మన్ చాంబర్లోనే మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ప్రమాణం చేశారు. కాగా, బుధవారమే గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, ఆమెర్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా.. స్టేటస్ కో విధించాలన్న హైకోర్టు తీర్పుతో అది ఆగిపోయింది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతోనే మండలి చైర్మన్ ప్రమాణం చేయించారు.