ఎమ్మెల్సీలుగా మహేశ్​ కుమార్,​ బల్మూరి ప్రమాణం

ఎమ్మెల్సీలుగా మహేశ్​ కుమార్,​ బల్మూరి ప్రమాణం
  • ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా

హైదరాబాద్​, వెలుగు : ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేశ్​ కుమార్​ గౌడ్, బల్మూరి వెంకట్​ బుధవారం ప్రమాణం చేశారు. శాసన మండలి చైర్మన్​ గుత్తా సుఖేందర్​ రెడ్డి వారితో మండలిలో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​  బాబు, ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్​​ అలీఖాన్​ హాజరయ్యారు. కాగా, ప్రమాణ స్వీకారానికి బల్మూరి వెంకట్  బుల్లెట్​పై మండలికి వచ్చారు. పెద్ద సంఖ్యలో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ఆయనతో పాటు వచ్చారు.

దీంతో మండలి చైర్మన్​ చాంబర్​లోనే మహేశ్​ కుమార్​ గౌడ్​, బల్మూరి వెంకట్​ ప్రమాణం చేశారు. కాగా, బుధవారమే గవర్నర్​ కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, ఆమెర్​ అలీఖాన్​ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా.. స్టేటస్​ కో విధించాలన్న హైకోర్టు తీర్పుతో అది ఆగిపోయింది. దీంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలతోనే మండలి చైర్మన్  ప్రమాణం చేయించారు.