బిస్కెట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..

బిస్కెట్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం..

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్  లోని బిస్కెట్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు కంపెనీ మొత్తం అంటుకుని భారీ అగ్ని ప్రమాదానికి దారి తీశాయి. అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.

 ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటల్లో భారీగా ఆస్తినష్టం వాటిల్లవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే దాని పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.