హైదరాబాద్ సిటీ, వెలుగు: మంజీరా ఫేజ్-–2లోని కలబ్గూర్–పటాన్చెరు పంపింగ్ మెయిన్కు చెందిన 1500 మి.మీ. వ్యాసం గల ప్రధాన పైప్లైన్కు రుద్రారం సమీపంలో భారీ లీకేజీ ఏర్పడింది.
దీనికి వాటర్బోర్డు రిపేర్లు మొదలుపెట్టింది. దీంతో శుక్రవారం ఆర్సీ పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, బీరంగూడ, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ.
ట్రాన్స్ మిషన్ డివిజన్ 2 ఆఫ్ టేక్ పాయింట్స్, బల్క్ కనెక్షన్లు, ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ ప్రగతి నగర్ ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని ఆఫీసర్లు తెలిపారు.
