
స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వైర్. (Tillu Square). మల్లిక్రామ్ (Mallik Ram) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. టిల్లు మూవీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ పై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
His-Story will repeat once again in theatres with #TilluSquare! ??
— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2023
Tillu anna MASS is all set to blast the theatres with DOUBLE the FUN & DOUBLE ENTERTAINMENT from FEB 9th, 2024! ??#TilluSquareOnFeb9th ?#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli… pic.twitter.com/LPdKINmS18
ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ అండ్ వీడియోస్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9 గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. దానికి.. టిల్లు అన్న మాస్ ఫిబ్రవరి 9, 2024 నుంచి స్టార్ట్.. డబుల్ ఫన్ అండ్ డబుల్ ఎంటర్టైన్మెంట్ థియేటర్లను పేల్చడానికి సిద్ధంగా ఉండండి.. అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి బ్లాక్ బస్టర్ టిల్లు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న టిల్లు స్క్వైర్ మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.