చెన్నై ఎయిర్ పోర్టులో వజ్రాలు స్వాధీనం

చెన్నై ఎయిర్ పోర్టులో వజ్రాలు స్వాధీనం

విలువ రెండు కోట్లు ఉంటుందని అంచనా

చెన్నై: తమిళనాడులోని చెన్నై ఎయిర్ పోర్టులో 2 కోట్లు విలువైన వజ్రాలు పట్టుబడ్డాయి. మలేషియా నుంచి చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. లోదుస్తుల్లో దాచిన 55 ప్యాకెట్ల వజ్రాలను  స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మలేషియాకు చెందిన అజ్మల్ ఖాన్ నాగూర్ మీరా (48) ను అదుపులోకి తీసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.