సైప్రస్: ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్. వైశాలి చరిత్ర సృష్టించింది. 2026 ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచింది. బుధవారం (ఏప్రిల్ 15) సైప్రస్లో జరిగిన ఫైనల్ రౌండ్లో కాటెరినా లాగ్నోపై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. చివరి రౌండ్లో అద్భుత ప్రదర్శనతో 8.5 పాయింట్లతో టోర్నీని కైవసం చేసుకుంది.
తద్వారా ఈ టోర్నీ గెలిచిన తొలి భారతీయ మహిళగా ఆర్.వైశాలి చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో 2026 చివర్లో జరిగే మహిళల ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు వైశాలి అర్హత సాధించింది. చైనాకు చెందిన జు వెన్జున్తో మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం వైశాలి తలపడనుంది.

