ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి మాతృవియోగం

ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డికి మాతృవియోగం

రంగారెడ్డి: ప్రభుత్వ చీఫ్​ విప్​ పట్నం మహేందర్ రెడ్డి మాతృమూర్తి  పట్నం రుక్కమ్మ (95) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా  అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న రుక్కమ్మ శుక్రవారం (జూలై 24) సాయంత్రం తుది శ్వాస విడిచారు.

మహేందర్ రెడ్డి స్వగ్రామం షాబాద్​ మండలం గొల్లూరుగూడలో రుక్కమ్మ అంత్యక్రియలు శనివారం నిర్వహించనున్నారు.  రుక్కమ్మ మరణవార్త విన్న  మాజీ మంత్రులు పటోళ సబితా ఇంద్రారెడ్డి, హరీష్​ రావు, రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్​ సునీత రెడ్డి, మాజీ స్పీకర్​ మధుసూదనాచారి మహేందర్​ రెడ్డి నివాసానికి వెళ్లి రుక్కమ్మ భౌతిక కాయానికి పూల మాల వేసి నివాళులర్పించారు. స్వర్గీయ  మాజీ హోంమంత్రి  పి ఇంద్రారెడ్డి కి రుక్కమ్మ పెద్ద అక్క.