మా సమస్యలు పరిష్కరించండి..సీఎం కు మల్లన్నసాగర్ నిర్వాసితుల లేఖ

మా సమస్యలు పరిష్కరించండి..సీఎం కు మల్లన్నసాగర్ నిర్వాసితుల లేఖ

సమస్యలు పరిష్కరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ నిర్వాసితులు. 2016 నుంచి తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖలో వివరించారు తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు. 2016 నుంచి భూములు తీసుకుంటున్నా ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదన్నారు. ఇళ్ల స్ట్రక్చర్లకు పరిహారాలు ఇవ్వడం లేదన్నారు. ఒంటరి మహిళలు, పురుషులకు, 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు ఉపాధి, పునరావాసం కల్పించడం లేదన్నారు. 250 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయకుండానే ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట ఆర్డీవో,  కలెక్టర్ తమ సమస్యలు పరిష్కరించడం లేదన్నారు ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామస్తులు. కోర్టుకు వెళ్లినందుకు తమపై కక్ష సాధిస్తున్నారని చెప్పారు. తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరారు.