మల్లికార్జున్‌ ఖర్గేకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

 మల్లికార్జున్‌ ఖర్గేకు జడ్ ప్లస్ సెక్యూరిటీ

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్‌ ఖర్గే భద్రత విషయంలో హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఖర్గేకు వీఐపీ భద్రత కల్పించాలని అంటే  జెడ్ ప్లస్ భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ముప్పు అవగాహన నివేదికను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. 

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఖర్గేకు భద్రత కల్పిస్తుందని వర్గాలు తెలిపాయి.  జెడ్‌ ప్లస్  కేటగిరిలో ఆరుగురు గన్‌మెన్‌లు, ఇంటి వద్ద కాపలాలకు మరో ఇద్దరిని ( ప్లస్ 8) పెడతారు.  ఖర్గే దేశంలోఎక్కడికైనా వెళ్లినప్పుడల్లా 50 మందికి పైగా కమాండోలు ఆయన వెంట వస్తుంటారు.  

 జడ్ ప్లస్ సెక్యూరిటీ కింద 24 గంటలూ భద్రత ఉంటుంది. కనీసం 36 మంది భద్రతా సిబ్బంది షిప్టుల వారీగా కాపలా కాస్తారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నవారికి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సీఐఎస్ఎఫ్‌లు భద్రత నిర్వహిస్తారు. కొన్నిసార్లు ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ సిబ్బంది కూడా ఎస్కార్ట్‌గా ఉంటారు.