నాగర్ కర్నూల్ టికెట్  నాదే .. రేవంత్ స్పష్టత ఇచ్చారు: మల్లు రవి

నాగర్ కర్నూల్ టికెట్  నాదే .. రేవంత్ స్పష్టత ఇచ్చారు: మల్లు రవి

హైదరాబాద్, వెలుగు: రానున్న లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ ఈ టికెట్ విషయంలో ఇప్పటికే స్పష్టత ఇచ్చారని తెలిపారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను 40 ఏండ్లుగా రాజకీయాలలో కొనసాగుతున్నప్పటికీ ఎవరికీ దగ్గర కాదు, ఎవరికీ వ్యతిరేకం కాదని చెప్పారు.  బీజేపీ నియంత పార్టీ అని విమర్శించారు.

మతాన్ని నమ్ముకొని రాజకీయం చేసే పార్టీ అని మండిపడ్డారు. రామాలయం పేరుతో రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం వరుసగా గ్యారంటీలను అమలు చేస్తోందన్నారు.