మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ఏప్రిల్ 30 ఆదివారం రోజున రాత్రి 11 గంటల సమయంలో మరో వ్యక్తిని కారు బానెట్పై ఎక్కించి దాదాపు మూడు కిలో మీటర్లు లాక్కెళ్లాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతన్ అనే వ్యక్తి స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఓ ప్రయాణికుడిని రాత్రి 11 గంటల ప్రాంతంలో డ్రాప్ చేసి తిరిగి వెళ్తుండగా ఆశ్రమచౌక్ వద్ద తన కారు మరో వ్యక్తి మూడు సార్లు ఢీ కొట్టాడని తెలిపాడు.
దీంతో తాను అతని కారు ముందుకు వచ్చి బయటకు దిగామని అన్నానని.. అతను మద్యం సేవించి ఉండటంతో తన మీదికి కారు పంపించడాని చెతన్ తెలిపాడు. దీంతో తాను కారు బానెట్పై ఉన్నానని , కారు ఆపమని చాలా సార్లు చెప్పినప్పటికీ అతను తన మాట వినలేదన్నాడు. అయితే అటు వైపుగా వెళ్తున్న పోలీసులు ఇది గమనించి అతని కారుని వెంబడించారని బాధితుడు చేతన్ తెలిపాడు.
అయితే ఈ ఘటనపై నిందితుడు రాంచంద్ కుమార్ మాట్లాడుతూ.. తాను అసలు అతని కారును ఢీ కొట్టలేదని చెప్పాడు. అతను ఉద్దేశపూర్వకంగా తన కారు బానెట్పైకి ఎక్కి తనను కారులోంచి దిగమని నానా హంగమా చేశాడని ఆరోపించాడు. కారు బానెట్ నుంచి దిగమని అతనికి తాను చాలాసార్లు చెప్పానని కాని అతను వినలేదని రాంచంద్ కుమార్ తెలిపాడు.
కారు బీహార్ ఎంపీ చందన్ సింగ్కు చెందినదని పోలీసులు గుర్తించారు. అయితే సమయంలో ఎంపీ కారులో లేరని, ర్యాష్ డ్రైవింగ్ కింద రాంచంద్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.