రాయపర్తి, వెలుగు: పొలంలో కలుపు మందు కొడుతున్న వ్యక్తి, కిందకు వేలాడుతున్న కరెంట్ తీగలు తగిలి చనిపోయాడు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్నగర్ గ్రామానికి చెందిన మద్దెబోయిన రాజు (26)కు అదే ఊరికి చెందిన రాధికతో కొన్నాళ్ల కిందట పెళ్లయింది. ఉన్న ఎకరం పొలంలో పంట వేసినా గిట్టుబాటు కాలేదు. హైదరాబాద్ వలసెళ్లి అక్కడ కూలీ పనిచేశాడు. చాలీచాలని డబ్బులతో కుటుంబం గడవడం కష్టమైంది. దీంతో మళ్లీ ఊరికి తిరిగొచ్చాడు.
ఉన్న పొలంలోనే పంట వేసి, కూలి పనులకూ వెళుతున్నాడు. ఈ క్రమంలో శనివారం తన ఇంటికి సమీపంలోనే ఉండే ఎల్లయ్యే అనే వ్యక్తి పొలంలో కలుపు మందు కొట్టేందుకు వెళ్లాడు. పొలంలో చేతికి అందే ఎత్తులోనే కరెంట్ తీగలు ఉన్నాయి. మందు కొడుతున్న క్రమంలో కిందికి వేలాడిన ఆ తీగలు తగిలి రాజు చనిపోయాడు.