
అయ్యో పాపం.. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ..71 యేళ్ల వయస్సులో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వృద్దుడు. అది కూడా రన్నింగ్ లో ఉన్న ట్రైన్ కు ఎదురెళ్లి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన మంగళవారం (జూన్24 )చెన్నైలోని అలువా రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ALSO READ | Viral Video: రియల్ హీరో..చిరుతతో కుస్తి పట్టిన యువకుడు..సినిమా ఫైటింగ్ తలపించిన సీన్
నీరిక్కోడ్ కు చెందిన 71 యేళ్ల మురళి అనే వ్యక్తి అలువా రైల్వే స్టేషన్ లో చెన్నై అలప్పళ్ల రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అప్పటివరకు రైలు పట్టాల పక్కన నిలబడిన ఆ వృద్ధుడు సరిగ్గా రైలు స్టేషన్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా పట్టాలపైకి వెళ్లి నిల్చున్నాడు. దీంతో రైలు ఢీకొని గాల్లోకి ఎగిరి తిరిగి పట్టాలపై పడిపోయాడు.
71-year-old Murali commits suicide by jumping in front of speeding train in Kerala. Video goes viral#Kerala #Railways pic.twitter.com/Wba6PYrf1L
— Bharat Media (@bharatmediahub) June 24, 2025
గమనించిన ప్రయాణికులు రైలు వెళ్లిపోయిన తర్వాత తీవ్రగాయాలపాలైన వృద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వృద్దుడు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. పోస్ట్ మార్టమ్ అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగించారు. వృద్ధుడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.