మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ లో 2024 మార్చి 16 శనివారం గంజాయిని పట్టుకున్నారు మేడ్చల్ SOT పోలీసులు. పాత నేరస్తుడు బానోత్ సాయి కుమార్ దగ్గర 5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
వైజాగ్ నుంచి గంజాయి తీసుకుని వచ్చి.. లేబర్ అడ్డాల దగ్గర రోజువారీ కూలీలకు గంజాయి అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు సైబరాబాద్ SOT మేడ్చల్ టీమ్.