
- తమిళనాడు హెర్బల్ కంపెనీలో ఘటన
- డేంజర్ నుంచి బయటపడ్డ మరొకరు
చెన్నై: కరోనా వైరస్ను అరికట్టేందుకు తాము తయారు చేసిన మెడిసిన్ తీసుకున్న తమిళనాడు హెర్బల్ ప్రొడెక్ట్స్ ఫామ్ ఉద్యోగి ఒకరు చనిపోయారు. సంస్థలో ఫార్మాసిస్ట్గా పనిచేస్తున్న కె.శివానిసేన్ (47), ప్రొడక్షన్ మేనేజర్ రాజ్కుమార్ (67) ఇద్దరు కలిసి కరోనాకు మెడిసిన్ తయారు చేశారు. వాళ్లిద్దరు దాన్ని తమపై స్వయంగా టెస్ట్ చేసుకోగా అది వికటించి శివానీసేన్ చనిపోయాడు. రాజ్కుమార్ తక్కువ మోతాదులో మందు తీసుకోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని, అతడిని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నామని పోలీసులు చెప్పారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు.