
- ఢిల్లీలో జరిగిన ఏబీవీపీ మహాసభల్లో నియామకం
శంషాబాద్, వెలుగు: ఢిల్లీలో జరిగిన ఏబీవీపీ 69వ జాతీయ మహాసభల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి గ్రామానికి చెందిన సీహెచ్ మణికంఠను రాష్ట్రీయ కళామంచ్ నేషనల్ కో కన్వీనర్గా నియమిస్తూ జాతీయ అధ్యక్ష కార్యదర్శులు రాజ్ చరణ్ షాహి, యగ్లవల్క శుక్లా ప్రకటించారు.
ఈ సందర్భంగా మణికంఠ మాట్లాడుతూ.. నాపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తనకు అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. విద్యార్థి కళాకారులకు రాష్ట్రీయ కళామంచ్ తోడుగా ఉంటుందన్నారు.