కేరళలో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా స్టాండ్ కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి. మలప్పురం జిల్లా పూంగోడ్ స్టేడియంలో ప్రతి ఏటా ప్రాంతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లను నిర్వహిస్తారు. ఎప్పటిలానే ఈ సారి కూడా నిర్వహించారు. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్టుండి గ్యాలరీ (స్టాండ్) కుప్పకూలడంతో పలువురికి గాయాలయ్యాయి.
#WATCH Temporary gallery collapsed during a football match in Poongod at Malappuram yesterday; Police say around 200 people suffered injuries including five with serious injuries#Kerala pic.twitter.com/MPlTMPFqxV
— ANI (@ANI) March 20, 2022
రెండు ప్రాంతీయ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్యాలరీలో కొంత భాగం కూలిపోయింది. అక్కడే ఉన్న దాదాపు 200 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనతో వీక్షకులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే గ్యాలరీ కుప్పకూలింది. వెంటనే క్షతగాత్రులను నిలంబూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.