చాలా మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ తో టచ్ లో ఉన్నరు..

చాలా మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ తో టచ్ లో ఉన్నరు..

టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్ తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజా గోస - బీజేపీ భరోసా కార్యక్రమానికి వెళ్తూ.. జడ్చర్లలో మీడియాతో మాట్లాడిన ఈటల... కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే అనేకసార్లు చెప్పారని, రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. నియోజకవర్గాల్లో పనుల కోసమే టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశాలతో సీఎం‌ కేసీఆర్ పై పోటీ చేస్తామన్న ఈటల.. అనేక మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్ లో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని చెప్పారు. అంతే కాదు తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఈటల రాజేందర్ విశ్వాసం వ్యక్తం చేశారు.