మూడు ముళ్లు వేయాలంటే మరో 6 నెలలు ఆగాల్సిందే..

మూడు ముళ్లు వేయాలంటే మరో 6 నెలలు ఆగాల్సిందే..

హైదరాబాద్, వెలుగుకల్యాణమొచ్చినా, కక్కొచ్చినా ఆగదంటారు. కానీ, కరోనా కారణంగా ఇప్పటికే వాయిదా పడ్డ పెళ్లిళ్లు మళ్లీ పోస్ట్​పోన్​ అవుతున్నాయి. లాక్​డౌన్​ ​ఎత్తేస్తే ఈ నెలో, వచ్చే నెలో గ్రాండ్​గా మ్యారేజ్​ చేసుకుందామనుకున్న యువతీ, యువకులు తాజా పరిస్థితులు చూసి నారాజ్​అవుతున్నారు. వచ్చే నెలలో ఓన్లీ నియర్​ అండ్ ​డియర్ ​మధ్య చేసుకుందామని కొందరు అనుకుంటుంటే, ఎక్కువమంది మాత్రం నవంబర్​ దాకా ఆగైనా ఫుల్​జోష్​లో చేసుకుంటామని చెప్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, సినీ స్టార్స్ వరకు అందరూ ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. టాలీవుడ్​ హీరోలు నిఖిల్, నితిన్ ఇప్పటికే తమ వెడ్డింగ్స్ పోస్ట్​పోన్​ చేసుకున్నారు. మళ్లీ నవంబర్ లోనే ముహూర్తాలుండగా, చాలామంది అప్పుడే చేసుకుంటామని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే పెండ్లికి ఏర్పాట్లు చేసుకుని అడ్వాన్స్​లు ఇచ్చినవాళ్లు, ఉపాధి లేక వెడ్డింగ్ ప్లానర్స్, ఈవెంట్ ఆర్గనైజర్స్ ఇబ్బంది పడుతున్నారు.

క్లారిటీ లేకపోవడంతో..

హైదరాబాద్​ సిటీలో ప్రతి సమ్మర్​లో 3 లక్షలకు పైగా మ్యారేజెస్ జరుగుతుంటాయి. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు ముహూర్తాలున్నాయి. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ చేసుకున్న వారిలో చాలామంది కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పెళ్లికి ఇంట్రెస్ట్ చూపడం లేదు.  ప్రభుత్వం లాక్ డౌన్​ను ఈ నెల 29 తర్వాత కూడా పొడిగిస్తుందోమోనన్న డౌట్​తో నవంబర్​లో చేసుకుంటే బెటర్​ అనుకుంటున్నారు.

ఈవెంట్ మేనేజ్ మెంట్లకు దెబ్బ

సిటీలో 500కిపైగా ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలున్నాయి.  ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి మంగళ స్నానాలు, సంగీత్, ఎంటర్ టైన్ మెంట్, ఫంక్షన్ హాల్ లో లైటింగ్, డెకరేషన్, క్యాటరింగ్, ఇతర పెండ్లి పనులు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ వరకు అన్నీ చేస్తుంటాయి. ఒక్కో కంపెనీ ద్వారా 100 నుంచి 200 మంది వర్కర్స్  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
ప్రస్తుతం వారంతా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోలేదని ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సంప్రదాయ ఈవెంట్స్​కి చెందిన- సీహెచ్ సాయికిరణ్​ తెలిపారు.

ఇంకో ఆర్నెల్లు ఇలాగే ఉండొచ్చు

మేం వెడ్డింగ్ ప్లానింగ్ పై ఎక్కువ ఫోకస్ పెడ్తాం. ఎవరైనా పెండ్లి వేడుక లైఫ్ లాంగ్ గుర్తుండా లనుకుంటారు. అందుకే ఇప్పుడు పెళ్లిళ్లు పోస్ట్ పోన్ చేసుకుంటున్నారు. మాకు వచ్చిన  ఆర్డర్లలో 12 ప్రీమియం మ్యారేజెస్ వాయిదా పడ్డాయి. వెండర్స్ అందరికి ముందే అడ్వాన్స్ ఇచ్చేశాం. ఇప్పుడవన్నీ హోల్డ్ లో పడ్డాయి. నవంబర్ వరకు ఇలాగే ఉంటుందనుకుంటున్నా.

– అరుణ్ కుమార్, వజ్ర ఈవెంట్స్

ఏప్రిల్​లో అనుకుంటే..

ఏప్రిల్ 2న పెళ్లి డేట్ పెట్టుకున్నా. వెడ్డింగ్ ప్లానర్స్​కి రూ.6 లక్షల అడ్వాన్స్​ ఇచ్చా. లాక్​డౌన్​తో సీన్ ​మారిపోయింది. అమ్మాయి ఒడిశా నుంచి రావాలి. లాక్ డౌన్ ఇంకా ఎన్నిరోజులు పొడిగిస్తారో అర్థం కాట్లేదు. కొద్దిరోజులు  పరిస్థితి చూసి పెళ్లి ఎప్పుడనేది ప్లాన్​ చేస్తాం.

– సిటీకి చెందిన ఓ పెండ్లి కొడుకు మాట