లైంగిక వేధింపులతో వివాహిత సూసైడ్

లైంగిక వేధింపులతో వివాహిత సూసైడ్

గద్వాల, వెలుగు: లైంగిక వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మార్లబీడు గ్రామానికి చెందిన రేణుక(20)ను జాముపల్లె గ్రామానికి చెందిన గోపాల్ కు ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం చేశారు. అదే గ్రామానికి చెందిన వీరేశ్​ ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. వేధింపులు తీవ్రమై భర్తకు విషయం తెలియడంతో ఆమెను పుట్టింటికి పంపించేశాడు. మార్లబీడుకు వచ్చినా వేధింపులు తగ్గలేదు. బుధవారం వీరేశ్​ ఆమె ఇంటికి వెళ్లి మరీ బెదిరించాడు. దీంతో బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటికి తిరిగి వస్తుండగా వీరేశ్ ​కుటుంబసభ్యులు ఆమెపై దాడి చేశారు. మనస్తాపానికి గురైన రేణుక ఇంటికి చేరుకోగానే పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు గమనించి హాస్పిటల్ కు తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. వీరేశ్​తో పాటు కుటుంబసభ్యులపై కేసు నమోదు చేసినట్లు గద్వాల సీఐ షేక్ మహబూబ్ బాషా చెప్పారు.