దసరా బరిలో టైగర్ నాగేశ్వర రావు.. రిలీజ్పై క్లారిటీ ఇచ్చిన మాస్ రాజా

దసరా బరిలో టైగర్ నాగేశ్వర రావు.. రిలీజ్పై క్లారిటీ ఇచ్చిన మాస్ రాజా

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageshwara rao).  భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ(Vamshee) తెరకెక్కిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ మూవీ రిలీజ్ విషయంలో వివాదం నెలకొంది.దీంతో మాస్ రాజా ఫ్యాన్స్ కు రిలీజ్ డేట్ ఏంటనే సందిగ్ధం మొదలైంది.

ఇక లేటెస్ట్ గా హీరో రవితేజ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. తాను స్వయంగా నిర్మించి రిలీజ్ చేస్తున్న చాంగురే బంగారు రాజా మూవీ ప్రీ రిలీజ్ కి అటెండ్ అయ్యారు. టైగర్ నాగేశ్వర రావు మూవీ ఫస్ట్ ఫిక్స్ అయిన అక్టోబర్ 20 కే థియేటర్స్ కి రానుందనే విషయాన్ని వెల్లడించారు. ఈ మూవీ దసరా బరిలో పోటీగా ఉండనుందనే కన్ఫర్మ్ చేశారు. అలాగే, అక్టోబర్ 19న  బాలయ్య బాబు భగవంత్ కేసరి, విజయ్ దళపతి లియో మూవీస్ ఉండటంతో.. గట్టి పోటీ షురూ కానుంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

కాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ఆపాలంటూ..స్టువర్ట్ పురం గ్రామస్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో రిలీజ్ అయ్యే వరకు ఏం జరుగుతుందో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్. 

1970 కాలంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవడ్ బ్యూటీ నుపుర్‌ సనన్‌(Nupur Saonon ) హీరోయిన్ గా నటిస్తోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్‌(Abhishek Agarwal Arts Byanar) పై అభిషేక్ అగర్వాల్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అనుపమ్ ఖేర్, మురళీశర్మ, రేణు దేశాయ్, గాయత్రీ భార్గవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్(gvprakash) సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ వీస్సా డైలాగ్స్ అందిస్తున్నారు.