ఆసీస్​ టీ20 కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వేడ్

ఆసీస్​ టీ20 కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వేడ్

మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌: వరల్డ్​కప్‌‌‌‌‌‌‌‌ అనంతరం ఇండియాతో  ఐదు టీ20ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో పోటీపడే ఆస్ట్రేలియా టీ20 టీమ్‌‌‌‌‌‌‌‌కు వెటరన్ వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. నవంబర్ 23న మొదలయ్యే ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌ కోసం 15 మందితో కూడిన టీమ్‌‌‌‌‌‌‌‌ను ఆసీస్ శనివారం ప్రకటించింది.

కమిన్స్‌‌‌‌‌‌‌‌, స్టార్క్, హేజిల్‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌, కామెరూన్‌‌‌‌‌‌‌‌ గ్రీన్‌‌‌‌‌‌‌‌, మిచెల్‌‌‌‌‌‌‌‌ మార్ష్​లకు రెస్ట్ లభించగా..  వార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మిత్‌‌‌‌‌‌‌‌, ట్రావిస్‌‌‌‌‌‌‌‌ హెడ్​ బరిలోకి దిగనున్నారు. ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ 23న వైజాగ్‌‌‌‌‌‌‌‌లో, చివరి టీ20   డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరగనుంది. 


ఆస్ట్రేలియా టీమ్‌‌‌‌‌‌‌‌: మాథ్యూ వేడ్ (కెప్టెన్), వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్,మాక్స్‌‌‌‌‌‌‌‌వెల్, మాట్ షార్ట్,  స్టోయినిస్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, బెరెన్‌‌‌‌‌‌‌‌డార్ఫ్, సీన్ అబాట్, నేథన్ ఎలిస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్​ సంఘా, ఆడమ్ జంపా.