రైలు ప్రమాదం: తెగిపడిన కాలునే తలకింద దిండుగా పెట్టారు

రైలు ప్రమాదం: తెగిపడిన కాలునే తలకింద దిండుగా పెట్టారు

హరియాణాలోని ఫరీదాబాద్ లో దారుణం జరిగింది. రైలు ప్రమాదంలో ఓవక్తి కాళ్లు తెగిపడ్డాయి. ప్రదీప్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. శుక్రవారం ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వెళ్లే మార్గంలో… రైలు పట్టాలు దాటుతుండగా.. అతడి కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. అదే టైమ్ లో ఆ మార్గంలో వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రదీప్ రెండు కాళ్లు తెగి పోయాయి. గమనించిన స్థానికులు.. అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ ప్రదీప్ కు సరైన చికిత్స అందివ్వలేదు. స్ట్రెచర్ పై తీసుకెళ్లిన సిబ్బంది…… తెగిపడిన కాళ్లనే అతనికి తల కింద దిండుగా.. పెట్టి తీసుకుపోయారు. ఈ విషయంలో  హాస్పిటల్ సిబ్బంది తీరును చాలామంది విమర్శించారు. ప్రమాదంలో గాయపడిన అతడి మానసికి స్థితి గురించి ఏమైనా ఆలోచించారా … అంత దారుణంగా ప్రవర్తిస్తారా.. అంటూ దీంతో హాస్పిటల్ సిబ్బంది తీరును తప్పుపట్టారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ప్రదీప్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.