తొలిసారి అంతరిక్షంలో సైనిక విన్యాసాలు

తొలిసారి అంతరిక్షంలో సైనిక విన్యాసాలు

భూమిపైనే కాకుండా పుడమి వెలుపల ఎదురయ్యే ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అమెరికా ప్రపంచంలోనే తొలిసారిగా వింగ్​ స్పేస్​ ఫోర్స్​ (యూఎస్​ఎస్​ఎఫ్​) భూ కక్ష్యలో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నది. 

 అమెరికా స్పేస్​ ఫోర్స్​ ఇటీవల రాకెట్​ ల్యాబ్​ నేషనల్​ సెక్యూరిటీ, ట్రూ అనోమలీ అనే ప్రైవేట్​ అంతరిక్ష కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని స్పేస్​ సిస్టమ్స్​ కమాండ్​ పేర్కొంది. ఈ మిషన్​కు విక్టస్​ హేజ్​ అని పేరు పెట్టారు. దీనిని 2025లోగా అమలు చేసే అవకాశం ఉంది. 
 ఈ రెండు కంపెనీలు స్పేస్​ ఫోర్స్​కు అవసరమైన ఆర్​పీఓ ( రెండెజౌస్​, ప్రాక్సిమిటి ఆపరేషన్స్​ అంటే దాదాపు ఒకే కక్ష్యలో ఉన్న రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉపగ్రహాల ఎత్తు, దశలను, వాటి సాపేక్ష స్థితులను సరిపోల్చడం), అంతరిక్ష నౌకలు వంటివి అందించనున్నాయి. ట్రూ అనోమలీకి చెందిన స్పేస్​ వెహికల్​ జాకల్​, రాకెట్​ ల్యాబ్​కు చెందిన మానవరహిత వాహనం కక్ష్యలో సంభవించే ప్రతికూల పరిస్థితులకు స్పందించే యూఎస్​ స్పేస్​ ఫోర్స్​ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి.