ఏపీ సీఎం జగన్ కు మంత్రి ఈటల లెటర్ 

ఏపీ సీఎం జగన్ కు మంత్రి ఈటల లెటర్ 

ఆంధ్రప్రదేశ్ సీఎం YS జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఓ లెటర్ రాశారు. హుజూరాబాద్ కు చెందిన దొంత రమేశ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించాలని లేఖలో కోరారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన భక్తులకు రమేష్ గత 18 ఏళ్లుగా సేవలు అందిస్తున్నారని ఈటల తన లేఖలో తెలిపారు. కొత్త బోర్డు ఏర్పాటు సమయంలో సహజంగానే తెలంగాణకు ఒక బోర్డు మెంబర్ ను కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఈటల ప్రత్యేక ఆహ్వానితుడిగా రమేష్ పేరును సూచించారు.