సిద్దిపేట కలను సీఎం కేసీఆర్ నెరవేర్చిండు

సిద్దిపేట కలను సీఎం కేసీఆర్ నెరవేర్చిండు

సిద్దిపేటకు 6 దశాబ్దాల చరిత్ర ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఉత్సవ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా సమగ్ర స్వరూపం అనే గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు.. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయం నుంచి సిద్దిపేట జిల్లా కావాలని కల ఉండేదని..సీఎం కేసీఆర్ ఆ కల నెరవేర్చారని తెలిపారు. సభా నాయకుడు, సభా ప్రతిపక్ష నాయకులు, సిద్దిపేట నుంచే వచ్చారన్నారు. 

సిద్దిపేట మట్టిలోనే సేవా భావం ఉంది..అన్నింటిలో సిద్దిపేట అభివృద్ధి చెందుతుందని హరీష్ రావు చెప్పారు. ఒక నాడు బుక్కెడు త్రాగు నీటి కోసం కష్టం ఉండే..ఇప్పుడు కాళేశ్వరంతో నీటి గోస తీరిందని తెలిపారు. సిద్దిపేటకు రైలు వచ్చింది, ఒక్క విమానం రావడమే తక్కువ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు..హక్కిం పేటను డొమెస్టిక్ చేస్తే..అది కూడా తీరనుందని పేర్కొన్నారు. సిద్దిపేటలో అన్ని చదువులకు సదుపాయాలు వచ్చాయని వెల్లడించారు.