కాంగ్రెస్ పార్టీకి అభినందనలు : శుభం జరగాలని కోరుకుంటున్నాను : ట్విట్టర్లో కేటీఆర్

కాంగ్రెస్ పార్టీకి అభినందనలు : శుభం జరగాలని కోరుకుంటున్నాను : ట్విట్టర్లో కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమిని ఓప్పుకున్నారు మంత్రి కేటీఆర్. పూర్తిస్థాయిలో ఇంకా రిజల్ట్స్ రాకముందే... కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. స్వయంగా ఓటమిని ఒప్పుకున్నారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. 

2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2023లో జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి తాము బాధపడడం లేదని, కానీ... తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందామని ట్వీట్ లో చెప్పారు. ఈ ఓటమిని తాము చాలెంజ్ గా తీసుకుని..  భవిష్యత్తులో మరింత బలంగా తయారవుతామని చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు... మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.