తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓటమిని ఓప్పుకున్నారు మంత్రి కేటీఆర్. పూర్తిస్థాయిలో ఇంకా రిజల్ట్స్ రాకముందే... కేటీఆర్ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. స్వయంగా ఓటమిని ఒప్పుకున్నారని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు.
2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు బీఆర్ఎస్ కు అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. 2023లో జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ గురించి తాము బాధపడడం లేదని, కానీ... తాము ఆశించిన స్థాయిలో ఫలితాలు లేకపోవడంతో నిరాశ చెందామని ట్వీట్ లో చెప్పారు. ఈ ఓటమిని తాము చాలెంజ్ గా తీసుకుని.. భవిష్యత్తులో మరింత బలంగా తయారవుతామని చెప్పారు.
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government ?
— KTR (@KTRBRS) December 3, 2023
Not saddened over the result today, but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back…
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు... మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.