కార్మిక నాయకులకు కార్పొరేటర్ టికెట్స్

కార్మిక నాయకులకు కార్పొరేటర్ టికెట్స్

బీజేపీ అంటేనే జూటా పార్టీ అన్నారు మంత్రి మల్లారెడ్డి. వరంగల్ భద్రకాళీ అమ్మవారినిక ఆయన దర్శించుకున్నారు. బీజేపీ పార్టీ నాశనమై కేసీఆర్ దేశ నాయకుడు కావాలని భద్రకాళి అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.బీజేపీ పాలిత రాష్టాల్లో దళిత బంధు అమలుచేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి సవాల్ చేశారు. అవసరమైతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్లను ఎవరైనా ఏమన్నా అంటే తరిమికొడతామన్నారు. కార్మిక శాఖ మంత్రిగా తానున్న..వినయ్ భాస్కర్ అంత పని చేయలేకపోయానని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేస్తుంటే కుటుంబ పాలన అంటూ మోడీ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రంలో నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు.భవన నిర్మాణ కార్మికులు ఎవరు మరణించిన రైతుభీమ తరహాలో నష్టపరిహారం అందజేస్తామన్నారు. కరోన వల్ల కార్మికుల కు భీమాపతకం  అనుకున్న సమయానికి అమలు చేయలేకపోయినట్లు తెలిపారు. 30 లక్షల మంది కార్మికులు హైదరాబాద్ కు వలస వస్తున్నారన్నారు. కరోన కాలంలో కార్మికులు చాలా నష్టపోయారని చెప్పారు. ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలను తెలంగాణకు తెచ్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. కార్మిక నాయకులకు కార్పొరేటర్ టికెట్స్ ఇవ్వాలని వినయ్ భాస్కర్ కు సూచిస్తున్నట్లు తెలిపారు.