బీజేపీ అంటేనే జూటా పార్టీ అన్నారు మంత్రి మల్లారెడ్డి. వరంగల్ భద్రకాళీ అమ్మవారినిక ఆయన దర్శించుకున్నారు. బీజేపీ పార్టీ నాశనమై కేసీఆర్ దేశ నాయకుడు కావాలని భద్రకాళి అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.బీజేపీ పాలిత రాష్టాల్లో దళిత బంధు అమలుచేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి సవాల్ చేశారు. అవసరమైతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్లను ఎవరైనా ఏమన్నా అంటే తరిమికొడతామన్నారు. కార్మిక శాఖ మంత్రిగా తానున్న..వినయ్ భాస్కర్ అంత పని చేయలేకపోయానని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలను కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేస్తుంటే కుటుంబ పాలన అంటూ మోడీ మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. కేంద్రంలో నెక్స్ట్ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని దీమా వ్యక్తం చేశారు.భవన నిర్మాణ కార్మికులు ఎవరు మరణించిన రైతుభీమ తరహాలో నష్టపరిహారం అందజేస్తామన్నారు. కరోన వల్ల కార్మికుల కు భీమాపతకం అనుకున్న సమయానికి అమలు చేయలేకపోయినట్లు తెలిపారు. 30 లక్షల మంది కార్మికులు హైదరాబాద్ కు వలస వస్తున్నారన్నారు. కరోన కాలంలో కార్మికులు చాలా నష్టపోయారని చెప్పారు. ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలను తెలంగాణకు తెచ్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. కార్మిక నాయకులకు కార్పొరేటర్ టికెట్స్ ఇవ్వాలని వినయ్ భాస్కర్ కు సూచిస్తున్నట్లు తెలిపారు.
కార్మిక నాయకులకు కార్పొరేటర్ టికెట్స్
- తెలంగాణం
- May 28, 2022
లేటెస్ట్
- హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన