భూక‌బ్జా వార్త‌లు అవాస్త‌వం.. ఏ ‌విచారణకైనా సిద్ధం

భూక‌బ్జా వార్త‌లు అవాస్త‌వం.. ఏ ‌విచారణకైనా సిద్ధం

హైద‌రాబాద్: భూకబ్జా చేసినట్టు త‌న‌పై వ‌స్తున్న‌ ఆరోపణలపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జా వార్తలు అవాస్తవమని.. అసలు శ్యామల ఎవరో తనకు తెలియదని ఆయన తేల్చి చెప్పారు. ఆమెను స్థలం అమ్మాలని కూడా తాను అడగలేదని, బెదిరింపులకు పాల్పడలేదని మల్లారెడ్డి పేర్కొన్నారు.ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని మల్లారెడ్డి స్పష్టం చేశారు. అసలు ఆ భూమి తమకు అవసరం లేదని.. ఇష్టపూర్వకంగా అమ్మితే కొంటామని, లేదంటే లేదని చెప్పారు. భూమికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకుని వస్తే శ్యామలకు న్యాయం చేస్తానని.. మల్లారెడ్డి హామీ ఇచ్చారు.