ప్రపంచ హైడ్రోజన్​ సదస్సు 2024

ప్రపంచ హైడ్రోజన్​ సదస్సు 2024

ప్రపంచ హైడ్రోజన్​ సదస్సును ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్​ హైడ్రోజన్​తో పర్యావరణంలో కార్బన్​ ఉద్గారాలను తగ్గించడానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల ప్రతినిధులు సమావేశమయ్యే ప్రతిష్టాత్మక కార్యక్రమం. ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ప్రతినిధులు ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. 

    నెదర్లాండ్స్​లోని రోటర్డ్యామ్​లో మే 13 నుంచి 15 వరకు వరల్డ్​ హైడ్రోజన్​ సమ్మిట్​ 2024 జరిగింది. ఇందులో భారత ప్రభుత్వం గ్రీన్​ హైడ్రోజన్​ పాలసీకి సంబంధించి సొంత పెవిలియన్​ను ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో అతి పెద్ద పెవిలియన్లలో ఇదీ ఒకటి.
    భారతదేశం తరఫున నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ, సైన్స్​ అండ్​ టెక్నాలజీ విభాగం రైల్వే మంత్రిత్వశాఖ, పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వశాఖ ప్రైవేట్​ రంగ సంస్థలు పాల్గొన్నాయి.