అమ్మాయిలకు ‘సెల్ఫ్ డిఫెన్స్’ ట్రెయినింగ్

అమ్మాయిలకు  ‘సెల్ఫ్ డిఫెన్స్’ ట్రెయినింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల్లో చదువుతున్న అమ్మాయిలకు ఆత్మరక్షణ పద్ధతులు నేర్పించేందుకు షీటీమ్స్ ద్వారా ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ  మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి డీజీపీకి లేఖ రాశారు. విద్యార్థినులపై అఘాయిత్యాలు, దాడులు జరగకుండా సరైన అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్ విభాగంతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సమస్య వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? అనే విషయంపై విద్యార్థినులకు అవేర్ నెస్ పెంచాలని మంత్రి సూచించారు. షీ-టీమ్స్‌‌పై అవగాహన పెంచాలన్నారు. అన్ని హెల్ప్ లైన్ నెంబర్ల పట్ల పూర్తి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలు, కాలేజీ విద్యార్థినులు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు. వాట్సాప్, ఫేస్‌‌బుక్, ట్విట్టర్‌‌లలో వస్తున్న ఫిర్యాదులపై కంట్రోల్ రూమ్, షీ-టీమ్, పోలీసులు స్పందించి బాధితులకు అండగా నిలవాలని మంత్రి ఆదేశించారు.