సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ని దర్శించుకున్నారు. అమ్మవారికి 2.5 కేజీల బంగారంతో చేసిన చీరను సమర్పించారు. అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటునుంచి వెస్లీ చర్చికి వెళ్లి పాస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న గణేష్ టెంపుల్ని దర్శించుకున్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని దేవుడిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.
Offered special prayers and presented a gold saree of 2.5 kg to Goddess Yellamma at Balkampet Temple on the auspicious occasion of Hon’ble CM Sri KCR Garu Birthday. #HappyBirthdayKCR pic.twitter.com/dZGkZfedRl
— Talasani Srinivas Yadav (@YadavTalasani) February 17, 2021
For More News..
బాంబు తయారీ నేర్పిస్తుండగా పేలుడు.. 30 మంది మృతి
అపార్ట్మెంట్లో మ్యారేజ్ యానివర్సరీ.. 103 మందికి కరోనా
మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న మెడల్స్ వీరుడు