కోల్బెల్ట్, వెలుగు: స్కిల్ డెవలప్మెంట్లో దేశానికి తెలంగాణ రోల్మోడల్అని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. రాష్ట్ర యువతకు విదేశాల్లో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మంగళవారం మంచిర్యాల జిల్లా మందమర్రిలో వివేక్ పర్యటించారు. సింగరేణి స్కిల్డెవలప్మెంట్ సెంటర్లో జర్మనీ లాంగ్వేజ్ శిక్షణ పొందుతున్న యువతతో ముచ్చటించారు. అనంతరం బీ-1 క్యాంపుఆఫీస్లో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జర్మనీలో ఏడాదికి రూ. 25 లక్షల వరకు జీతం పొందే అవకాశం ఉందని, అభ్యర్థులు ఎంత త్వరగా భాషను నేర్చుకుంటే అంత త్వరగా ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. జర్మనీ, జపాన్, సౌదీ దేశాల్లో 25 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు తెలంగాణలో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మందమర్రిలో ఏర్పాటు చేశామన్నారు. స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి కేంద్రం ఇతర రాష్ట్రాల్లో ఒక్కో క్లస్టర్ కేటాయిస్తే.. తెలంగాణకు మాత్రం 4 క్లస్టర్లను ఇచ్చిందన్నారు. ఒక్కొక్క క్లస్టర్కు రెండు వందల కోట్ల చొప్పున తెలంగాణకు రూ.800 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
మీ పార్టీ ఖాతాలోకి వందల కోట్లు ఎలా వచ్చాయ్?
బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో రూ.1,400 కోట్ల నిధులు ఎలా వచ్చాయో కేటీఆర్ సమాధానం చెప్పాలని మంత్రి వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఈ ప్రశ్నను కేటీఆర్ సోదరి కవితే లేవనెత్తారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్కు ప్రజలు విరాళాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు వందల కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఎలక్ట్రోరల్ బాండ్ల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు.
కేబినెట్ ఆమోదం లేకుండానే కేటీఆర్ ఈ-ఫార్ములా రేస్ కోసం రూ.50 కోట్ల ప్రభుత్వ నిధులను విదేశీ కంపెనీకి కేటాయించారని తెలిపారు. వర్షాలు రావద్దని బీఆర్ఎస్ లీడర్లు పూజలు చేశారని పేర్కొన్నారు. కాగా, సింగరేణి సంస్థకు కేటాయించిన తాడిచర్ల బ్లాక్-–2 గనికి, రామకృష్ణాపూర్ ఓపెన్కాస్ట్ ఫేజ్-2 గనికి అవసరమైన పర్యావరణ అనుమతులు త్వరలో మంజూరు కానున్నాయని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి ఇటీవల కేంద్ర పర్యావరణ, -అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్రయాదవ్తోపాటు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డిని కలిసి అనుమతుల కోసం విన్నవించామని, వారు సానుకూలంగా స్పందించారన్నారు. రెండేండ్లు తాము చేసిన పోరాటంతోనే సింగరేణికి కొత్త బొగ్గు బ్లాక్లు దక్కాయని పేర్కొన్నారు.
