దోహా: ఇండియా స్టార్ వెయిట్లిఫ్టర్ సైకోమ్ మీరాబాయి చాను.. ఖతార్ ఇంటర్నేషనల్ కప్లో స్వర్ణంతో మెరిసింది. శుక్రవారం జరిగిన మహిళల 49 కేజీల కేటగిరీలో చాను 194 కేజీల బరువు ఎత్తి టాప్లో నిలిచింది. పురుషుల 67 కేజీల విభాగంలో జెరెమీ లాల్రినుంగా సిల్వర్ గెలిచాడు. ఫైనల్లో లాల్రినుంగా మొత్తం 306 (స్నాచ్ 140+ క్లీన్ అండ్ జర్క్ 166) కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచాడు.
ఒలింపిక్ క్వాలిఫయింగ్ సిల్వర్ లెవల్ ఈవెంట్లో భాగంగా జరిగిన ఈ టోర్నీకి సంబంధించిన పాయింట్లను ఫైనల్ ర్యాకింగ్స్లో కలిపి టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ను ప్రకటిస్తారు. ఒలింపిక్స్కు క్వాలిఫై కావాలంటే.. ప్రతి లిఫ్టర్ 6 నెలల్లో కనీసం ఒక్క ఈవెంట్లోనైనా బరిలోకి దిగాలి. నవంబర్ 2018 నుంచి ఏప్రిల్ 2020 వరకు కనీసం ఆరు ఈవెంట్లలో పాల్గొనడంతో పాటు ఒక్క స్వర్ణానైనా గెలవాలి.