న్యూఢిల్లీ: వచ్చే ఏడాది న్యూజిలాండ్లో జరిగే మహిళల వన్డే వరల్డ్కప్?కు ఇండియా టీమ్ అర్హత సాధించింది. మహిళల చాంపియన్షిప్?లో రద్దయిన సిరీస్లకు సంబంధించిన పాయింట్లను సమంగా పంచడంతో టీమిండియాకు 23 పాయింట్లు లభించాయి. దీంతో ఆస్ట్రేలియా (37 పాయింట్లు), ఇంగ్లండ్ (29), సౌతాఫ్రికా (25)తో పాటు ఇండియాకు డైరెక్ట్ ఎంట్రీ దక్కింది. ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్ కూడా బెర్త్ను ఖాయం చేసుకుంది. మిగిలిన మూడు బెర్త్ల కోసం శ్రీలంక, వెస్టిండీస్ సహా 10 జట్లు క్వాలిఫయింగ్ టోర్నీలు ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7, 2021 వరకు జరుగనున్న ఈ మెగా ఈవెంట్లో మొత్తం ఎనిమిది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. వాస్తవానికి ఐసీసీ మహిళల చాంపియన్షిప్? ఫలితాల ఆధారంగా వరల్డ్కప్? బెర్త్లు కేటాయించాల్సి ఉంది. కానీ ఇందులో మూడు సిరీస్లు రద్దు కావడంతో పాయింట్లను పంచారు. 2019 జులై–నవంబర్ మధ్యలో ఇండియా, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన సిరీస్ రద్దు అయ్యింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో టీమిండియా సిరీస్ నుంచి వైదొలిగింది. ఇక సౌతాఫ్రికా–ఆస్ట్రేలియా, శ్రీలంక–న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సిరీస్లు… కరోనా దెబ్బకు రద్దయ్యాయి. ప్రస్తుతం పాకిస్థాన్ 19, వెస్టిండీస్ 13, శ్రీలంక 5 పాయింట్లతో వరల్డ్కప్? బెర్త్ కోసం పోటీపడుతున్నాయి. మరోవైపు జులై 3 నుంచి శ్రీలంకలో వరల్డ్కప్? క్వాలిఫయర్స్ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణతో ఇది జరుగుతుందో లేదో కూడా సందేహంగా మారింది. అయితే దీనిపై ఐసీసీ తుది నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. 2017 వరల్డ్కప్? రన్నరప్గా నిలిచిన ఇండియా.. ఐసీసీ మహిళల చాంపియన్షిప్?లో ఇప్పటిదాకా 21 మ్యాచ్లాడి 10 గెలిచి, 8 ఓడింది. గతేడాది నవంబర్లో మిథాలీ రాజ్ నాయకత్వంలోని టీమిండియా చివరిసారి వెస్టిండీస్పై 2–1 తేడాతో వన్డే సిరీస్ నెగ్గింది.