యాలాల్లో గుప్త నిధుల కలకలం

యాలాల్లో గుప్త నిధుల కలకలం

పరిగి  వెలుగు: యాలాల్లో గుప్తనిధుల కలకలం రేగింది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని  విశ్వనాథ్ పూర్ గ్రామ శివారులో వెంకట్ రెడ్డి పొలంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పురాతన శివ లింగాన్ని పెకిలించారు. ఆదివారం ఉదయం గ్రామస్తులు వెంకట్ రెడ్డి పొలంలో జరిగిన సంఘటన చూసి పొలం యజమానికి తెలిపారు. 

పొలం దగ్గరికి వెళ్లి చూసిన రైతు.. యలాల పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి  చేరుకుని పరిశీలించారు.  పురాతన శివలింగం తొలగించిన దగ్గర మద్యం, కల్లు బాటిల్ కనిపించాయి.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పురాతన శివలింగం తొలగించడం గుప్త నిధుల కోసమేనని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.