ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికులకు నివాళులు అర్పించారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. సంగారెడ్డిలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు హజరయ్యరై… ఆత్మ హత్య చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి, సురేంద్ర గౌడ్ లకు నివాళులు అర్పించారు. మీడియాతో మాట్లాడిన ఆయన… రవాణాశాఖ మంత్రి పువ్వడా అజయ్ కు హెచ్చరిక చేశారు. ఆర్టీసీ విలీనంపై  రవాణా మంత్రి రెపటికల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సంగారెడ్డి డిపో కు చెందిన 600 మంది కార్మికులతో హైదరాబాద్ తరలి వస్తానని తెలిపారు. అజయ్ ను హైదరాబాద్ లో ఘెరావ్ చేస్తామని తెలిపారు. ఇద్దరు ఆర్టీసీ కార్మికుల ఆత్మ బలిదానం చేసుకోవడం దురదృష్టకరమని చెప్పారు. కేసీఆర్ ఫోటోలకు  పాలు పోసి పూజలు చేసిన ఆర్టీసీ కార్మికులే నేడు కేసీఆర్ ను నిందించే పరిస్థితి రావడం దురదృష్టకరమని చెప్పారు. ఆర్టీసీని విలీనం చేస్తే కార్మికులతో పాటు తనుకూడా సీఎం కు  పాలాభిషేకం చేస్తానని చెప్పారు.