కరోనా బాధితులకు 2 ఉచిత అంబులెన్సులు

కరోనా బాధితులకు 2 ఉచిత అంబులెన్సులు

హైదరాబాద్: క‌రోనాతో డెడ్ బాడీల‌ను స్మ‌శాన వాటిక‌కు త‌ర‌లించాలంటే భారీగా డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నారుని తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.  ఈ క్ర‌మంలోనే  2 అంబులెన్సులు ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో అంబులెన్స్ సేవలుంటాయని, కరోనా బాధితులను సమీప ఆస్పత్రులకు చేరుస్తామని  తెలిపారు. క‌రోనా పేషెంట్ హాస్పిట‌ల్ కు వెళ్లాలన్నా..ఒక‌వేళ చ‌నిపోతే డెడ్ బాడీల‌ను స్మ‌శాన‌వాటిక‌కు చేర్చేందుకు ఈ ఫ్రీ అంబులెన్సులో తీసుకెళ్ల‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ అంబులెన్సులను ఆదివారం సాయంత్రం 3 గంటలకు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి  ప్రారంభించనున్న‌ట్లు తెలిపారు ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి.