కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ  : కేటీఆర్

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒకే ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్.  17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పక్కా గెలిచే స్థానం నల్లగొండ మాత్రమేనని చెప్పారు. నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి,  కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో బీఆర్ఎస్ గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.  పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్ లో  మీడియాతో చిట్ చాట్ చేశారాయన.    

ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం నామా నాగేశ్వరరావు గెలిపించుకుంటున్నారని చెప్పారు కేటీఆర్.  తాను ప్రత్యేకంగా సర్వే చేయించానని..  సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా సర్వే రిపోర్ట్ చెప్తోందన్నారు. కేసీఆర్ రంగంలోకి దిగిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందన్న కేటీఆర్ ..  కాంగ్రెస్ , బీజేపీ లకి భయం పట్టుకుందని తెలిపారు. సిరిసిల్లలో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను ఓటర్లకు ఒక్క రూపాయి కూడా పంచలేదన్నారు కేటీఆర్.  పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం చూపిస్తుందని అనుకోవడం తాను అనుకోవడం లేదన్నారు.