NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్‌ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?

NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్‌ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ (NTR) వరుసగా సినిమాలు చేస్తూనే సామాజిక సేవ కూడా చేస్తుంటాడు. తాజాగా ఎన్టీఆర్ మరోసారి తన హుదారతను చాటుకున్నారు. ఈ నందమూరి వారసుడు ఎన్నో విధాలైన సేవా కార్యక్రమాల కోసం, దైవ భక్తికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఎన్టీఆర్  విరాళాలు ఇస్తాడు అనే టాక్‌ ఎప్పటినుంచో నడుస్తుంది. ఇక అది నిజమే..దైవత్కార్యమే అంటూ తాజాగా మరో సంఘటన సాక్ష్యంగా నిలిచింది.  

వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఏర్పాటు చేసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం మరియు ఆ ఆలయ  ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎన్టీఆర్‌ ఏకంగా రూ.12.50 లక్షలను తన వంతు విరాళంగా ఇచ్చారు. ఎన్టీఆర్‌ ఇచ్చిన ఈ పెద్ద మొత్తం విరాళంను గుడి నిర్వాహకులు శిలా పలకంపై తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్‌ లక్ష్మీ ప్రణతి దంపతులు, వారి కుమారులు అభయ్ రామ్‌, భార్గవ్‌ రామ్‌, తల్లి షాలిని పేర్లతో ఈ  శిలా పలకన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ  శిలా పలకాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫోటోలు తీసుకుని సోషల్‌ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.చిన్న గుడికి అంత పెద్ద అమౌంట్ ను ఎన్టీఆర్ విరాళంగా ఇవ్వడంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే..కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ కలిసి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుస్తున్న ఈ  సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే హృతిక్ రోషన్ తో వార్ 2, సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు.